Saturday, June 18, 2011

వెన్నెలలో


సుమాల నడుమ
చషకంతో

వొంటరిగా
సేవిస్తూ

జాబిలిని అడిగాను
జత కట్టమని

చషకం
చషకంలో తేలియాడే
నాదొక్క
జాబిలిదొక్క బింబం
మేం ముగ్గురం... అంతే!

అరెరే
జాబిలి తాగలేదుకదా అని చింతించాను

నా నీడ అలా ఖాళీగా
నాతో అడుగులేస్తూ వుంది
అనంత మౌనంతో

సఖులెవ్వరూ లేరు సమక్షంలో

ఈ ఇద్దరి సావాసంలో
లేమి దిగులూ లేదు

యీ వుత్సవ కాలంలో
నేనూ నను చేరిన వారితో
సంబరించాలికదా

చల్లని వెన్నెలలో పాడుతుంటే
జాబిలి జత కట్టినట్టే వుంటుంది

నేనాడితే
నా నీడ నాతో సయ్యాడుతుంది

మందుకు ముందు
జాబిలి
నీడలే
నా సఖులు

మత్తెక్కిన మరుక్షణం విడిపోతాం

అయినా సరే
ఏ లౌకిక రాగ ద్వేషాల ఛాయ సోకని
వీళ్ళిద్దరే
నాకత్యంత యిష్ట సఖులు

బహుశా
ఒక నాటికి
పాలపుంతల లోపొరల్లో
మేం ముగ్గురం
మరోలా
మళ్ళీ కలుస్తాం


-లీ పో
(ఇతను క్రీస్తు శకం 701-762 మధ్య జీవించిన చైనా కవి)

1 comment:

Afsar said...

ఆనంతూ:

నీ కవితే అనుకున్నా చదువుతూ చదువుతూ.
లీ పో - అన్నావు చివరికి! ఎంత దగా!